29.7 C
Hyderabad
April 29, 2024 09: 00 AM
Slider నల్గొండ

సిసి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన కోతి సంపత్ రెడ్డి

#sampathreddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలో ఎన్జీవోస్ కాలనీలో సుమారు మూడు లక్షల అంచనా వ్యయంతో సిసి డ్రైనేజీ పనులకి కాంగ్రెస్ పార్టీ నాయకులు,మూడవ వార్డు ప్రజలతో కలిసి శనివారం వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి  పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీలో మూడో వార్డు అభివృద్ధిలో ముందు ఉంచే విధంగా గడిచిన రెండున్నర సంవత్సరాల నుండి సిసి రోడ్లు,డ్రైనేజీ పనులు జరిగాయని, మౌలిక సదుపాయాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక వీధుల్లో మట్టిని నింపి రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు మున్సిపల్ పాలకవర్గ తీర్మానం ఆమోదంతో మంజూరైన టియుఎఫ్ఐడిసి నిధుల నుండి 90 లక్షల రూపాయలతో ప్రధాన డ్రైనేజ్ లోకి అన్ని వీధులలో నుండి మురుగు,ఎన్ ఎస్ పి కాలువ వరద నీరు వెళ్ళే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను రూపకల్పన చేస్తున్నట్లు సంపత్ రెడ్డి తెలిపారు.

శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, 23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య, విజయ వెంకటేశ్వర్లు,వేముల వరలక్ష్మి, నాగరాజు,కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, నియోజకవర్గ మైనార్టీ నాయకుడు సైదా, ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షుడు రామరాజు,25వ,వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చంద్రశేఖర్,గంజి చంద్రమౌళి, బెంజిమెన్,రామ్మూర్తి,పట్టణ బిసి సంఘం అధ్యక్షుడు అంజి యాదవ్,వార్డు ప్రజలు అతి వెంకటేశ్వర్లు,మీరావలి,నాయక్, శ్రీనివాస రాజు,నాగశేఖర్,యువకులు, మహిళలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

రైతులకు నెలకు రూ.3000 మోడీ పెన్షన్

Satyam NEWS

[Free Sample] How Many Water Pills To Take To Lose Water Weight Pamabrom Weight Loss Pills That Work At Night Dr Schulze Intestinal Formula 2 Pills To Lose Weight

Bhavani

కర్ణాటకలో పవన్ కళ్యాణ్ “జనసేన” విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర

Satyam NEWS

Leave a Comment