31.2 C
Hyderabad
May 3, 2024 01: 31 AM
Slider రంగారెడ్డి

ఏఎస్ రావునగర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

#asraonagar

ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని తిరుమల హార్మోని అపార్ట్మెంట్ పక్కనుండి వెళ్లే నాలా పై రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఏఎస్ రావునగర్ లోని జపానీస్ పార్క్ సమీపంలో వీడీసీసీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.174.80 లక్షలతో  అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిలాల్ ,ఏఈ తిరుమలయ్య, జలమండలి మేనేజర్ స్రవంతి, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, ఏఎస్ రావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసం మహిపాల్  రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమారస్వామి రజక, బీఆర్ఎస్ నాయకులు బేతాళ బాలరాజు, కందుల లక్ష్మీనారాయణ, ఏనుగు సీతారాం రెడ్డి, రాంచందర్ గౌడ్,  నాయకులు రహీం, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

అత్యవసర చికిత్సపై అరుణ్ జైట్లీ

Satyam NEWS

ముస్తాబవుతున్న ఆదర్శ రైల్వే స్టేషన్లు

Bhavani

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించిన పోలీస్ బాస్ లు

Satyam NEWS

Leave a Comment