న్యూ ఇయర్ వేళ…క్రిస్మస్ పండుగ సందర్భం…ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు… తగు చర్యలు తీసుకుంటున్నారు. విజుబుల్ పోలీసింగ్ లో భాగంగా ఒక్క సారి సాయంత్రం వేళల్లో… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల ఎస్పీ ల ఆదేశాలతో పోలీసులు ఆకస్మిక తనిఖీ లు చేశారు. విజయనగరం జిల్లా పోలీసు ఎస్పీ దీపికా ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వివిధ కూడళ్లలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, విద్యార్దులకు రహదారి భద్రత, దిశా యాప్, రుణ యాప్, మహిళల భద్రత, సైబరు మోసాలు, నియంత్రణ పట్ల అవగాహన కల్పించి, ఎం.వి. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఈ-చలనాలు విధించారు.
previous post