40.2 C
Hyderabad
May 5, 2024 18: 00 PM
Slider నిజామాబాద్

తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్న తనయులు

#jukkal

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ  అభివృద్ధి ప్రదాత  కీర్తి శేషులు నాల్చర్ శ్రీహరి. ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. నియోజకవర్గంతో పాటు బిచ్కుంద మండల కేంద్రానికి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు  తీసుకురావడంలో ఆయన పాత్ర ప్రాముఖ్యమైంది. ఆయన మరణించాక  ఆయన కుమారుడు రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

ఇంకో కుమారుడు బాలు సొసైటీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇరువురు తండ్రి ఆశయ సాధన కోసం ఇప్పటికీ కృషిచేస్తూనే బిచ్కుంద అభివృద్ధికి తమవంతుగా శాసనసభ్యులు హనుమంత్ షిండే సహకారంతో ప్రత్యేక చొరవతో  ముందుకు సాగుతున్నారు. రాజు జెడ్పీటీసీ నిధులతో లక్షలాది రూపాయలు వెచ్చించి బిచ్కుంద పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకొని మరీ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

రెండో కుమారుడు బాలు కూడా సహకార సంఘం పరిధిలో  శనగలు   కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే సహకారంతో కొనుగోలు చేసిన నెలరోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా కృషి చేసారు. దీంతో వీరిద్దరి కృషికి మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తండ్రిలాగే వీరు కూడా రైతుల పట్ల, గ్రామాల పట్ల కలిసికట్టుగా అభివృద్ధి కోసం పాటు పడుతుండటంతో అందరూ పెద్దాయనను గుర్తు చేసుకుంటున్నారు. శ్రీహరి ఆకాంక్షలను ఇరువురు తమ పరిధిలో  సంక్షేమ అభివృద్ధి పథకాలతోపాటు రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తమదైన శైలిలో మేమున్నామని భరోసా కల్పిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు.

జి.లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఆ సమయం లో అసలు బయటకు రావొద్దు

Bhavani

‘దేశం’ నేత కళా వెంకట్రావు అరెస్ట్ అప్రజాస్వామికం

Satyam NEWS

డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు త్వరగా పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment