42.2 C
Hyderabad
May 3, 2024 16: 54 PM
Slider క్రీడలు

భారత పోలీస్ క్రీడాపోటీల విజేతలకు డీజీపీ అభినందన

#DGP

పంజాబ్, జలంధర్ లో నిర్వహించిన వాలీబాల్ క్లస్టర్ విభాగాల్లో యోగ, సెపక్‌ తక్రాలో అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ 15 మెడల్ తో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మేడల్స్ గెలుచుకొని ప్రధమ స్థానంలో నిలిచింది. అత్యధిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణం, కాంస్యం పతకాలు సాధించిన ఎపి పోలీస్ క్రీడకారులను అభినందించి, నగదు బహుమతిని అందించిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి.

గతంలో ఎన్నడు లేని విధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి పతకాలు సాదించిన విజేతలకు 10,000 స్వర్ణం పతక విజేతలకు, 5,000 కాంస్యం పతక విజేతలకు నగదు బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు.

డిసెంబర్ 10th నుండి 15th వరకు పంజాబ్ లోని జలంధర్ లో నిర్వహించిన 71వ జాతీయ స్థాయిలో జరిగిన వాలీ బాల్ క్లస్టర్-2022 లోని యోగా, సెపక్‌ తక్రా పోటీలలో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత రాష్ట్రాలు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన మొత్తం 2770 మంది క్రీడకారులు పాల్గొన్నారు. ఐ‌జి ఎల్.కే.వి రంగారావు, క్రీడలు & సంక్షేమం నేతృత్వం లోని క్రీడాకారుల బృందం ఇందులో పాల్గొన్నారు.

యోగా(మహిళలు)

యోగా 35 నుండి 55 సంవత్సరాల గ్రూప్ మహిళల విభాగంలో 5(గోల్డ్) బంగారు పతకాలు సాధించగా అదే సింగిల్స్ విభాగంలో విశాఖపట్నం కి చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మహిళా అధికారిని కళ్యాణి Bronze మెడల్ ను సొంతం చేసుకున్నారు.

యోగా(పురుషులు)

యోగా 35 నుండి 55 సంవత్సరాల గ్రూప్ పురుషుల విభాగంలో 5 (Bronze) మెడల్స్, అదే సింగిల్స్ విభాగంలో S.శేఖర్ రావు Bronze పతకాన్ని సొంతం చేసుకుంది.

SEPAKTAKRAW (సెపక్‌ తక్రా)

జలంధర్ లో నిర్వహించిన సెపక్‌ తక్రా పురుషుల డబుల్స్ లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జట్టు 3(Bronze)మెడల్స్ ను కైవసం చేసుకుంది.

Related posts

అందరి మనసుల్లో గుర్తుండిపోయే సినిమా “గుర్తుందా శీతాకాలం”

Bhavani

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటీలో కార్యక్రమం

Satyam NEWS

పశువుల అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు..!

Satyam NEWS

Leave a Comment