రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత నెల 27న హైదరాబాద్ లో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభలో ఆమోదించిన పలు తీర్మానాలు, ఫెడరేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గంతో కూడిన ప్రతిని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సోమవారం సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళిని కలిసి సమర్పించారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్లు ఇళ్ళస్థలాల సమస్యతో పాటు చిన్నపత్రికల సమస్యలు, జర్నలిస్టు బంధు పథకం, పెన్షన్ విధానం, ఆరోగ్య భీమా, అక్రెడిటేషన్ కార్డులు తదితర సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఎర్రం నర్సింగ్ రావు, ఎస్ కే సలీమా, హెచ్ యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు నాగవాణి తదితరులు పాల్గొన్నారు.