పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు.
నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాయకులు పరిశీలించారు. టి.పి.సి.సి జనరల్ సెక్రెటరీ, హుజూర్ నగర్ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వాల ఇంచార్జి నగేష్ ముదిరాజు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ డిజిటల్ సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నాయకులు అందరూ సభ్యత్వ నమోదు చేయించడంలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. 500 డిజిటల్ సభ్యత్వాలు చేసినవారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సన్మానం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క బూత్ ఎన్ రోలర్స్ సన్మానం పొందుటకు అర్హత సాధించాలని,పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల జీవిత భీమా వర్తిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు,ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు,బోలెద్దూ ధనమ్మ, జైలు,జక్కుల మల్లమ్మ,జక్కుల నరేందర్,కారంగుల వెంకటేశ్వర్లు, చింతకాయల రాము,యూత్ నాయకులు రెడపంగు రాము,కార్తీక్, బూత్ ఎన్ రోలర్స్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్