పేదవాడి వైద్యం ఖర్చుకు సాయం చేసిన కార్పొరేటర్ ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలోని 124 డివిజన్ అల్విన్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో ఎ.రాజు అనే వ్యక్తి నివసిస్తుంటాడు. అతనికి షుగర్ వ్యాధి కారణంగా కాలు తీసివేయాల్చి వచ్చింది. దాంతో కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ రాజుని పరామర్శించి మందుల ఖర్చుల నిమిత్తం 5000/- రూపాయలు ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నోళ్ల శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, CH. భాస్కర్, పోశెట్టిగౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post