ఈ రోజు దిలావర్ పూర్ ZPSS, ప్రైమరీ, ఉర్దూ మీడియం స్కూల్ విద్య కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. ZPSS స్కూల్ విద్యా కమిటీ ఛైర్మెన్ గా కదం నర్సింగ్ రావు, వైస్ ఛైర్మెన్ గా ఓలెం లక్ష్మీ, ప్రైమరీ స్కూల్ ఛైర్మెన్ గా నాయిమొద్దీన్, వైస్ ఛైర్మెన్ గా కవిత, ఉర్దూ మీడియం విద్యాకమిటీ ఛైర్మెన్ గా రహీమాన్ లను ఆయా పాఠశాల కమిటి సభ్యులు ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరేష్ కుమార్, ZPSS స్కూల్, ప్రైమరీ స్కూల్, ఉర్దూ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు గోజ్జ జనార్దన్, చంద్రశేఖర్, ఆహద్, వెంకట్ రెడ్డి వార్డు సభ్యులు ఈరప్ప, ఉదిగిరి సాయి, నాయకులు అనీల్, ఇషాక్, అన్వేష్, హరున్, శ్రీనివాస్, గంగాధర్, బషీర్, సమీ ఉపాధ్యాయులు పిల్లల పోషకులు తదితరులు పాల్గొన్నారు.