గాంధీనగర్ 14 వ వార్డు గబ్బు గబ్బు గా తయారైంది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత 24 సంవత్సరాలుగా గాంధీనగర్ 14వ వార్డు గబ్బుతో వర్ణనాతీతంగా తయారైంది. ఎన్నికల ముందుఅండర్ గ్రౌండ్ పైపులైన్లు వేయిస్తామని ఎన్నికల తరువాత చేతులు దులుపుకుంటున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దోమలు విష కీటకాలు పాములు సైతం ఇంట్లోకి వస్తున్నాయని24సంవత్సరాలుగాపలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిలో చలనం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్కనే ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలోకి పలుమార్లు విషపూరితమైన జీవాలు వచ్చాయని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విద్యను అభ్యసిస్తున్నారని ఆరోపించారు.
ప్రాణ భయంతో కాలనీ వాసులు సైతం తీవ్ర అనారోగ్యాల పాలవుతున్న మున్సిపాలిటీ అధికారులు నేటికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మున్సిపాలిటీ అయిన తర్వాత ఆదాయం ఉన్నను మా వార్డును పట్టించుకోవడంలేదని, పలు వార్డులను అభివృద్ధి చేసిన మాకు మాత్రం అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అసలే రానున్న కాలం వర్షాకాలం కావడంతో రోగాలు ప్రబలే సమయం కాబట్టి కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని మా ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.