తిరుమలలో ఘోరమైన అపచారం జరిగింది. ఎన్నడూ లేని విధంగా శ్రీ వారి హుండీ కింద పడిపోయింది. తిరుమల శ్రీ వారి ఆలయంలో ఇలాంటి అపచారం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. క్రింద పడిపోయిన హుండీ లోని భక్తులు ఇచ్చిన కానుకలన్నీ చెల్లాచెదరైపోవడం చూసిన భక్తులకు కంటనీటిని తెప్పించింది. తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద హుండీ క్రింద పడిపోయింది. బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
మహద్వారం నుంచి హుండీ ని వెలుపలకు తీసుకొస్తున్న సమయంలో మహా ద్వారం వద్ద కింద పడిపోయింది. దీంతో అందులోని కానుకలు అన్ని నేలపాలయ్యాయి. వెంటనే సిబ్బంది శ్రీవారి సేవకులు కానుకలన్నీ హుండీలో వేసి ట్రాలీలోకి ఎక్కించడం ద్వారా అక్కడే ఉండే లారీలో పరకామణి మండపానికి తరలించారు.