29.7 C
Hyderabad
May 1, 2024 05: 59 AM
Slider మహబూబ్ నగర్

సెల్ ఫోన్లను అప్పగించిన ఎస్పీ

వనపర్తిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ భాధితులకు అప్పగించారు. సెల్ ఫోన్ భాదితులను ఎస్పీ కార్యాలాయానికి పిలిపించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టిందని ఇందుకోసం వెబ్ సైట్ లో లాగిన్ కావాలని, అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుందన్నారు.

చివరగా. సెల్ (చరవాణి) పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని, సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ రక్షిత కె. మూర్తి కోరారు. ఈ పోర్టల్ ద్వారా వనపర్తి జిల్లాలోని మొత్తం 521 ఫోన్లు మిస్సింగ్ అయినాయని కంప్లైంట్ రాగా అందులో 72 ఫోన్స్ ట్రేస్ చేయడం జరిగిందని తెలిపారు.

29 ఫోన్లు ఫిర్యాదుదారులకు అందజేశారు. గతంలో 43 ఫోన్స్ ఫిర్యాదుదారులకు అందజేశారు. మిగతా ఫోన్లను కూడా ట్రేస్ చేసి ఫిర్యాదుదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పీ ఆనందరెడ్డి, సీఐ మహేశ్వర్ రావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ సీనియర్ విలేకరి సత్యం న్యూస్ నెట్

Related posts

రివోల్ట్: కాలుష్యంపై చర్యలు తీసుకోని అధికారుల ఘెరావ్

Satyam NEWS

షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

రైతు‌ను రాజు‌ చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment