విజయనగరం జిల్లా కేంద్రం లో నెలకొల్పిన దిశ(మహిళా) పోలీసు స్టేషన్ ను ఎన్సీపీసీఆర్ సభ్యులు డా.ఆర్.జీ.ఆనంద్ పరిశీలించారు. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం లో ఫ్లైట్ లో దిగిన ఆయనకు విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు అధికార స్వాగతం పలికి..అక్కడ నుంచీ నేరుగా విజయనగరం జేడ్పీ గెస్ట్ హౌస్ కు తీసుకువచ్చారు.
అక్కడ మీడియా తో మాట్లాడిన ఆయన…నేరుగా పోలీసు బ్యారెక్స్ వద్ద ఉన్న “దిశ” పీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడే దిశ డీఎస్పీ వేంకటేశ్వర్లు…స్టేషన్ లో బాధితులు సమస్యలకు తీసుకుంటు న్న చర్యలు ను కౌన్సిల్ సభ్యులకు తెలియజేసారు. అలాగే స్టేషన్ లో కౌన్సెలింగ్ కేంద్రం… అదేవిధంగా పిల్లల లాలలనకు సంబంధించి స్టేషన్ పరంగా తీసుకుంటున్న చర్యలను సభ్యులు ఆనంద్ కు వివరించారు స్టేషన్ మొత్తం కలియతిరిగిన సభ్యులు ఆనంద్ ..సంతృప్తి వ్యక్తం చేసి…రెండు చేతులు జోడించి… నమస్కారం చేసి వెళ్లడం కొసమెరుపు. ఈ పరిశీలనలో దిశ డీఎస్పీ తో పాటు సీఐతో పాటు ఎస్ఐ లు పద్య, శేఖర్.. ఏఎఎస్ఐ రిసెప్షన్ కానిస్టేబుల్ లు ఉన్నారు.