కామారెడ్డి ఎస్ఐ, సీఐల బెట్టింగ్ కేసు కాస్త డీఎస్పీ లక్ష్మీనారాయణ మెడకు చుట్టుకుంది. సీఐ, ఎస్లపై ఇప్పటికే ఏసీబీ అధికారులు దాడి చేసిన విషయం విదితమే కాగా, డీఎస్పీపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా విచారణ చేపట్టారు. బెట్టింగ్ వ్యవహారంలో డీఎస్పీ ప్రమేయం లేకపోయినప్పటికీ ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్థులు బయటపడడంతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. కాగా డీఎస్పీ ఇంట్లో చేసిన సోదాల్లో రూ.2.11 కోట్ల విలువైన ఆస్థులు ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అంతేగాక పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎవ్వరినీ వదలకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అవినీతి మూలాలపై ఏసీబీ చేస్తున్న దాడులు హర్షణీయమని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
previous post