41.2 C
Hyderabad
May 4, 2024 15: 56 PM
Slider మహబూబ్ నగర్

థాంక్ గాడ్: ఊపిరి పీల్చుకున్న నాగర్ కర్నూల్

#Nagarkurnool Dist Collector

నాగర్ కర్నూలు జిల్లా నుండి శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలకు హైదరాబాద్ ల్యాబ్ కు పంపించిన ఇద్దరు భార్యాభర్తలకు నెగిటివ్ రిపోర్టు వచ్చిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. వారిద్దరికీ కరోనా లేదని నిర్ధారణ అయిందని కలెక్టర్ శ్రీధర్ ఆదివారం వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీలు దగ్గు, జ్వరం, జలుబు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కానీ టోల్ ఫ్రీ నెంబర్ కు  సంప్రదించాలని ఆయన కోరారు.

ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ సొంత గ్రామాల్లో 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగరాదని కోరారు. ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి వచ్చే వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ను కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు.

Related posts

పిసిసి అధ్యక్షుడు రేవంత్ పై సీనియర్ల అసత్య ప్రచారం

Satyam NEWS

ఓ తారక రామా ఓ సారి ఇటు రావా

Satyam NEWS

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment