27.7 C
Hyderabad
May 4, 2024 07: 12 AM
Slider ముఖ్యంశాలు

బీజేపీకి దగ్గరయ్యేందుకే కమ్యూనిస్టులకు దూరం

#CPI

రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉందనే పేరుతో కమ్యూనిస్టులతో పొత్తు ధర్మానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తూట్లు పొడిచారని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో కమ్యూనిస్టుల సహాయంతో మునుగోడు ఎన్నికల్లో గట్టెక్కిన కేసీఆర్ ఆ విషయాన్ని మరిచారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ బలోపేతం అవుతున్న దృష్ట్యా బిజెపికి దగ్గరయ్యేందుకు కమ్యూనిస్టులకు దూరమయ్యారని తెలిపారు.

‘ అసెంబ్లీలో నిన్ను రక్షిస్తా, పార్లమెంట్లో నన్ను రక్షించు’ అనే రీతిలో బీజేపీ, బీఆర్ఎస్ లు ఏమవుతున్నాయన్నారు. పార్డీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తో కలిసి తమ్మినేని హాజరై ప్రసంగించారు. మునుగోడు ఎన్నికల ఆసరాతో తెలంగాణలో రాజ్యాధికారం కోసం బిజెపి వ్యూహం పన్నిందని తెలిపారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించే కమ్యూనిస్టులు కెసిఆర్ విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ పొత్తు ధర్మాన్ని కొనసాగించాలన్న కేసీఆర్ కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారనే సాకుతో తమకు దూరమయ్యారని తెలిపారు. కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ప్రధానం కాదన్నారు. కేరళలో కాంగ్రెస్ తోనే కమ్యూనిస్టులు పోరాడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీది అఖండ భారత స్ఫూర్తిని దెబ్బతీసే సిద్ధాంతం..

అఖండ భారత పోరాట స్ఫూర్తిని దెబ్బతీసే సిద్ధాంతం బిజెపిదని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మాన్ని వదలాలన్న ఉదయనిధి స్టాలిన్ పై బిజెపి సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. సనాతన ధర్మం అంటే మనుధర్మం, కులధర్మం అన్నారు. భూమి సమస్య, సామాజిక అణచివేత, ప్రజాస్వామ్య హక్కుల హరింపుకు వ్యతిరేకంగా సాగిన పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు.

ఈ సభలో సీపీఐ (ఎం) సీనియర్ నాయకులు పి. సోమయ్య, ఎం. సుబ్బారావు, అఫ్రోజ్ సమీన, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై. విక్రమ్, భూక్యా వీరభద్రం, చింతలచెర్వు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెంకటగిరి పోలేరమ్మ గుడిలో బాలయ్య జన్మదిన వేడుక

Satyam NEWS

మౌనిక దీక్షకు ములుగు జిల్లా సాధన సమితి సంఘీభావం

Satyam NEWS

శోభాయాత్రకు అందరూ సహకరించండి

Satyam NEWS

Leave a Comment