సరూర్ నగర్ ధర్మపురికాలనీలో వినాయకచవితి ఘనంగా జరిగింది. లింగోజిగూడ ధర్మపురికాలనీ లోని రోడ్ నెం 1లో వినాయక చవితి విగ్రహాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా వేదబ్రాహ్మణులచే పూజ గావించారు. భక్తి శ్రద్ధలతో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్గక్రమంలో పి.సురేశ్ కుమార్, సి.జగన్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బాలం శంకర్, రాఘవేంద్రరావు, కొరుప్రోలు హరనాథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ తొమ్మిది రోజులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో దిగ్విజయంగా చేయాలన్న ఆశయంతో ఉన్నారు.