31.2 C
Hyderabad
May 2, 2024 23: 53 PM
Slider కడప

మనుషుల్ని చంపే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం

#dlravindrareddy

ప్రభుత్వం మనుషులను చంపే ప్రయత్నంలో ఉందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వంట నూనెలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అయినా పట్టించుకునే నాథుడే లేడని ఆయన అన్నారు. వినియోగదారులు వంట నూనెలు ధరలు తో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూనెలు కల్తీ జరుగుతున్నాయి…అర్ధ బస్తా సుద్ద మిగతా అర్థం బస్తా విత్తనాలు తో నూనె తీస్తున్నారు…విజిలెన్స్ అధికారులకు విషయం తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు దారుణంగా వ్యవహరిస్తోంది…అని ఆయన అన్నారు. వేరుశెనగ నూనెలో కడప జిల్లా ప్రొద్దుటూరు లొనే 14 మిల్లులు ఉండగా చాలా మిల్లులు కల్తీ చేస్తున్నాయి… ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిసిన మిల్లులు సంగం ఉపాధ్యక్షుడు మేనేజ్ చేస్తున్నాడు…అని ఆయన అన్నారు. అధికారులు వినియోగదారుల ను చంపే ప్రయత్నం చేస్తున్నారు… ఎదైనా జరగారనిది జరిగితే వారిపై హత్యాయత్నం నేను కేసు వేస్తా…అని ఆయన అన్నారు.

Related posts

బీజేపీ నేత వెంకట రమణారెడ్డి అరెస్ట్

Satyam NEWS

సిబ్బందికి మేలు చేయనిది ఈ ఆర్టీసీ సమ్మె

Satyam NEWS

హనుమాన్ జయంతి యాత్రకు సంపూర్ణ సహకారం

Satyam NEWS

Leave a Comment