చిన్నతనం నుండి కృషి పట్టుదలతో ఎదిగిన వ్యక్తి,26 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో శ్రమజీవి అయిన డి.ఎల్.పాండు ముదిరాజు కు రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా ఎన్నిక కావడం,ఉమ్మడి రాష్ట్ర ముదిరాజులు గర్వించదగ్గ విషయమని సీనియర్ కార్మిక నాయకుడు శీతల రోషపతి కొనియాడారు.
ఈ సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ ఆర్థికంగా లేని వారికి ఉచితంగా న్యాయస్థానంలో వాదించిన వ్యక్తిగా,ముదిరాజులు బిసి డి నుండి బిసి ఏ గ్రూపులోకి మార్చాలని గల్లి నుండి ఢిల్లీ వరకు పోరాడిన వ్యక్తి డి.ఎల్ పాండు ముదిరాజ్ అని అన్నారు.రాష్ట్రం లోని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,జోర్క్ జగన్ ముదిరాజ్ తో పాటు డి.ఎల్. పాండు ముదిరాజ్ బిసి డి గ్రూపు నుండి బిసి ఏ గ్రూపులోకి మార్చాలని దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వారాల కొద్దిగా ఉండి పోరాడిన ఫలితంగా సుప్రీంకోర్టు ఈనెల అక్టోబర్ 11,2022 తేదీన బిసి డి గ్రూప్ నుండి ఏ గ్రూపులోకి మార్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం గర్వించదగ్గ విషయమని,వీరి కృషి ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని రోషపతి అన్నారు. హైదరాబాదు లోని హయత్ నగర్ కాలనీలో న్యాయవాది పాండు స్వగృహంలో శాలువాకప్పి,పూలమాలలతో సన్మానించి, సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అవతా సైదులు ముదిరాజు,బంధువులు,మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్