37.2 C
Hyderabad
May 2, 2024 13: 32 PM
Slider తూర్పుగోదావరి

జగన్ పార్టీ నుండి లీడర్లు పారిపోవడం షురూ!

#navataramparty

వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందని,జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఆపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పారిపోవడం షూరూ అయిందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. వైస్సార్సీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు తో మొదలైన ధిక్కారం వైస్సార్సీపీ ఎమ్మెల్యేలకూ పాకిందని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధిక్కార స్వరంతో  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు మొదలైంది అన్నారు.

ఎంపీలు, మాజీ మంత్రులు కూడా కొందరు చాపకింద నీరులా తిరుగుబాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది అన్నారు.సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కాకుండా షాడో ముఖ్యమంత్రి గా వ్యవహరించడం ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తి కి కారణం అన్నారు.ఫోన్లు టాపింగ్ చేయడం, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎదురుతిరుగుతారని అనుమానం వస్తే కేసులతో వేధించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు గా మారడంతో ఆపార్టీ నేతలు పలాయన మార్గంలో పయనిస్తున్నారన్నారు.

ఎదురు తిరిగిన నేతల్ని తిట్టేందుకు ప్రత్యేకంగా బూతు కమిటీలు ఏర్పాటు చేసిన ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవాచేశారు.ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీలు బలోపేతం కావడంతో  జగన్మోహన్ రెడ్డి పడవకు చిల్లు పడిందని 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పడవ మ్యూనిగిపోతుందని నవతరంపార్టీ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం జోస్యం చెప్పారు.

Related posts

వనపర్తి జిల్లా పోలీసుల ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

Satyam NEWS

రెండు రోజుల్లో పోడు పట్టాల ప్రక్రియ పూర్తి

Bhavani

[2022] Lionheart Male Enhancement Do Penis Extenders Work

Bhavani

Leave a Comment