27.7 C
Hyderabad
May 4, 2024 09: 27 AM
Slider అనంతపురం

పీజీ సీటు టెన్షన్ లో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

#suicide

ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ వైద్య విద్య కోసం సిద్ధం అవుతున్న ఒక యువతి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డది. అనంతపురం జిల్లా హిందూపురం లో ఈ దుర్ఘటన జరిగింది. వైసీపీ నాయకుడు హిందూపురంలోని 1వ వార్డు కౌన్సిలర్ అయిన మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) కర్నూలులోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

అనంతరం ఇంటి వద్ద ఉండి పీజీ వైద్య విద్య కోసం సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలో తాను ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు దక్కుతుందో లేదోననే ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె ఇంటి మేడపైన ఉన్న గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గమనించిన తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు హిందూపురం వన్ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Related posts

అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి

Satyam NEWS

విజయనగరంలో సామాజిక సాధికార బస్సు యాత్ర

Satyam NEWS

కరోనా డ్యూటీలలో అలసత్వం వద్దు: ప్రకాశం జిల్లా ఎస్ పి

Satyam NEWS

Leave a Comment