31.2 C
Hyderabad
May 3, 2024 00: 50 AM
Slider ముఖ్యంశాలు

మూడు రాజధానుల కోసం 101 టెంకాయలు కొట్టి పూజలు

#meda

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద మూడు రాజధానులకు మద్దతుగా పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి  బుధవారం 101 టెంకాయలు వైసీపీ నేతలు కొట్టారు. ప్రతిపక్ష పార్టీలు వారి కుల సామాజిక వర్గం అభివృద్ధి చెందితే చాలు అని వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే చాలు అనుకున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి మనసు కూడా మారే లాగా చూడమని, అన్ని ప్రాంతాలు అభివృద్ధికి సహకరించేలా చూడాలని చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చొప్ప యల్లారెడ్డి, ఈడిగ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ చిదానంద గౌడ్, రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ గుల్జార్ భాష, రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి, రాజంపేట వార్డు కౌన్సిలర్ పసుపులేటి సుధాకర్, రాజంపేట వార్డు కౌన్సిలర్ తంబ సుధాకర్, బీసీ నాయకులు వెంకటసుబ్బయ్య, రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, పాలగిరి మల్లికార్జున్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు పాలగిరి సుధాకర్ రెడ్డి, నరసయ్య, ఖాజా మొహిద్దిన్, కృష్ణారావు, నందలూరు జడ్పీటీసీ గడికోట వెంకటసుబ్బారెడ్డి, మందరం మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, డీసీఎంస్ చైర్మన్ దండు గోపి, జడ్పీటీసీ దాసరి పెంచలయ్య, రమేష్ నాయుడు, గోవింద్ బాలకృష్ణ,  మున్సిపల్ కౌన్సిలర్ న్యామతుల్లా, కార్పొరేషన్ డైరెక్టర్ జావీద్, శంకర్, నల్లబోతుల ఈశ్వరయ్య, వడ్డే శీను,మిగతా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

బాన్సువాడ అభివృద్ధి పనులపై స్పీకర్ సమీక్ష

Satyam NEWS

తెరాసలో చేరిన ఖమ్మం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

Satyam NEWS

శ్రీకాకుళం శంకర్ ఫౌంటేషన్ కంటి ఆసుపత్రిలో ప్రభుత్వ పథకం సేవలు

Satyam NEWS

Leave a Comment