BRS ప్రకటనతో తెలంగాణకు కేసిఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కెసిఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించుకున్నారని ఆయన అన్నారు. ఆ పార్టీ స్థాపనతోనే తెలంగాణాకి కెసిఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణా ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయింది.
తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కెసిఆర్ కి ఉన్న బంధం తెగిపోయింది అని ఈటల వ్యాఖ్యానించారు. కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తరువాత ఆయన నమ్ముకుంది మద్యాన్ని, డబ్బుని ప్రలోభాలను. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని కల పగటికలకంటున్నారు. అది కలగా మిగిలిపోతుంది అని ఆయన అన్నారు.
తెలంగాణ సమస్యలు పరిష్కరించలేనివాడు.. అనేక రకాల ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆ సంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు.