27.7 C
Hyderabad
May 4, 2024 07: 14 AM
Slider నెల్లూరు

పరిశోధన విద్యార్ధినికి డాక్టరేట్

#PVSriVaishnavi

విక్రమ సింహపురి యూనివర్సిటీ (వి.ఎస్.యు)లో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పరిశోధన విద్యార్ధినికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వి ఎస్ యు ఒక ప్రకటనలో పేర్కొంది.

బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఆచార్య సుజా ఎస్ నాయర్ పర్యవేక్షణలో పరిశోధన విద్యార్ధిని పి వి శ్రీ వైష్ణవి మార్కెటింగ్ స్ర్టాటజీస్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్స్ టైల్స్: ఏ స్టడి ఆఫ్ ఎస్ పి ఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే అంశం పై పరిశోధన చేసినందుకు వి ఎస్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఈ పరిశోధన వివిధ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించబడ్డాయి. జాతీయ సేమినార్స్ లో పేపర్స్ ప్రెజెంట్ చేశారు. బెస్ట్ పేపర్ అవార్డు కూడా వ‌చ్చింది. వి ఎస్ యు ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయం సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని, ఆ దిశగా యూనివర్సిటీ ఆచార్యులు కృషి చేస్తూ తమ పరిశోధన విద్యార్ధులచే అనేక నూతన ఆలోచనలకు, ఆచరణలకు నాంది పలుకుతున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు.

డైరెక్టర్ యం.చంద్రయ్య, రిజిస్ట్రార్ ఎల్ విజయకృష్ణ రెడ్డి, ప్రిన్సిపాల్, పరిశోధన అధికారి ఆచార్య సుజా ఎస్ నాయర్, పరీక్షల నిర్వాహణాధికారి డా .సి.యస్.సాయిప్రసాద్ రెడ్డి ఇతర అధ్యాపకులు పి వి శ్రీ వైష్ణవి ని అభినందించారు.

Related posts

ఘనంగా ఇందిరాగాంధీ 105వ, జయంతి వేడుకలు

Satyam NEWS

ఎక్క‌డిక్క‌డ వాహ‌నాల త‌నిఖీ….అడుగడునా పోలీసు నిఘా!

Satyam NEWS

పోలీసు స్పందనలో బాధితుల గోడు…

Satyam NEWS

Leave a Comment