రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు మూడు దశలలో జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విజయనగరం జిల్లాలో రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పట్లు చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ..స్పెషల్ ఇన్ ఫోర్స్ మెంట్ బ్యూరో నేతృత్వంలో దాడులు…నిర్వహిస్తొంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో విస్త్రత తనిఖీలు కూడా చేస్తోంది.
ఈ మేరకు జిల్లాలో జరనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్రమ రవాణాను నియంత్రించేందుకు అన్ని పోలీస్ చెక్ పోస్టుల వద్ద విస్త్రతంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.