జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల లింగగిరి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్,డాక్టర్ ప్రజున్ కుమార్ లను ఆరోగ్య సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మండల ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్ మాట్లాడుతూ వైద్యుడు భగవంతునితో సమానమని,తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మను ఇస్తారని, కరోనా కష్ట సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కోట్లాదిమందిని రక్షించిన వైద్యులను సన్మానించడం సమాజానికి గౌరవప్రదమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్,స్వాతి,సలోమీ,వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్