ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ములుగు జయశంకర్ జిల్లా కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దస్తావేజులు రాయడమే వృత్తిగా నమ్ముకొని మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన సంస్కరణలను స్వాగతిస్తూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి అనుసంధానంగా సేవలందిస్తున్న మమ్మల్ని సీఎం కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి మా దస్తావేజుల లేఖరులకు సాధ్యమైనంత తొందరగా లైసెన్సులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నలేఖరులు చింత నిప్పుల బిక్షపతి, చిటికనేని ప్రకాష్ రావు, కాకి పురుషోత్తం, సూరం రవీందర్, శనిగరపు మహేష్, బొచ్చు సుజాత సమ్మయ్య, బోడ రాజు, సూర్యదేవర విశ్వనాథన్, లాడే రాజేష్, లాడే హరినాధ్, చింత నిప్పుల రాజేందర్, శనిగరపు నరేష్, అలీమ్ సాదా రఘు తదితరులు పాల్గొన్నారు.
previous post