ప్రస్తుత సమాజంలో ఒకరికొకరు సహాయంగా నిలబటమే గొప్ప. ఇక మూగజీవాలను పట్టించుకునేవారు చాలా తక్కువ. కానీ ప్రతి వేసవిలో మూగజీవాలకు ఆహారాన్ని అందించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనలు అందుకుంటున్నధి. సత్తుపల్లి ఎంఎల్ఏ వెంకటవీరయ్య గత 5 సంవత్సరాలుగా ఖమ్మం పరిసర ప్రాంతాలనుండి
సత్తుపల్లి నియోజకవర్గంలోని గొశాలలకు గ్రాశాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది 150 ట్రాక్టర్ల గడ్డి తీసుకువచ్చి 11 గొశాలలకు అందించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ మానవ సంస్కృతిలో భాగమైన గోవులకు అండగా నిలబడటం రైతుల గొప్పతనానికి నిదర్శనం అని, గత ఏడాది వరదలు వచ్చినప్పుడు సత్తుపల్లి ప్రాంతంలో
కొందరు రైతులు సర్వస్వం కోల్పోయారు. ఆ సమయంలో రైతులకు ప్రభుత్వంతో పాటు అనేకమంది అండగా వున్నారని, గోవులకు మాత్రం తాము వందలాది ట్రాక్టర్ల ద్వారా గడ్డిని అందించామన్నారు. ఈ ఏడాది కూడా ఖమ్మం పరిసర
ప్రాంతాలలోని రైతులు వేసవి ఎండని కూడా లెక్కచేయకుండా మూగజీవాలకు గ్రాశాన్ని అందించేందుకు 150 ట్రాక్టర్ల ద్వారా తరలివచ్చారని తెలిపారు. ప్రస్తుతం సత్తుపల్లి నియోజకవర్గంకు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమం భవిష్యత్తులో జిల్లా అంతటికి వ్యాపించేలా ప్రయత్నిస్తామని చెప్పారు.