వనపర్తి జిల్లా గోపాలపెట, రేవల్లి పోలీస్ స్టేషన్ లను జిల్లా యస్.పి. రక్షిత కె. మూర్తి తనిఖీ చేశారు. డ్యూటీలో (విధుల పట్ల) నిర్లక్షంగా ఉన్నందుకు గోపాల్ పెట్ యస్.ఐ. మల్లేష్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. స్టేషన్ లొ నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, నేరస్థుల అరెస్ట్ కోసం పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డ్స్ తదితర విషయాలను యస్.ఐ.లను అడిగి తెలుసుకున్నారు. పరిశీలనలో గోపాల్ పెట్ పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్, కేసుల విచారణ సరిగ్గా లేనందుకు గోపాలపేట యస్.ఐ. మల్లేష్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్