ములుగు జిల్లా గణపురం మండల కేంద్రంలోని శ్రీ పోచమ్మ తల్లి పునః ప్రతిష్ట ఆలయం నిర్మాణం కోసం గణపురం వాస్తవ్యులు రాచర్ల సరోజన, ఆనందం దంపతులు బుధవారం రూ.1,00,116 అక్షరాల ఒక లక్ష 116 ల చెక్కును అందజేశారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఆనందం దంపతులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పునః ప్రతిష్ట నిర్మాణ కమిటీ చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, గణపురం సర్పంచ్ కమిటీ గౌరవ అధ్యక్షులు నారగాని దేవేందర్ గౌడ్ ఎంపీటీసీ సభ్యులు మోటపోతుల శివ శంకర్ గౌడ్, పావుశెట్టి శ్రీనివాస్ పాశి కంటి రామకృష్ణ, రౌతు కిషోర్, కొయ్యల గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.