పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న నిత్యా అన్నదాన కార్యక్రమానికి విరాళాలు భారీగా అందుతున్నాయి.
కొయ్యలగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన ముళ్ళపూడి బాపూజీ కుటుంబ సభ్యులు అన్నదానం ట్రస్ట్ కి 1 లక్షా 1.116 రూపాయలు అందచేశారు.
ఈ సందర్భంగా బాపూజీ కుటుంబ సభ్యులను ఈ ఓ సుబ్బారెడ్డి అభినందించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించి, స్వామివారి శేషవస్త్రాన్ని అందించారు.
అనంతరం చిన్న తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని బాపూజీ కుటుంబ సభ్యులకు ఈ ఓ .డిప్యూటీ ఈ ఓ ఆలయ సిబ్బంది అందజేశారు.