31.2 C
Hyderabad
May 3, 2024 00: 05 AM
Slider విజయనగరం

రోటరీ క్లబ్ కైలాస భూమికి లక్ష విరాళం…!

#RotaryClub

రోటరీ చేస్తున్న సమాజ హిత కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,విజయనగరం 29వ డివిజన్ కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి, 23 వ డివిజన్ కార్పొరేటర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కేదారి శెట్టి సీతారామమూర్తి( రాంపండు)  37 వ డివిజన్ కార్పొరేటర్ కడియాల రామకృష్ణ లు అన్నారు. 

ఓ ప్రైవేటు అతిథి గృహంలో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆర్ ఐ డిస్ట్రిక్ట్ 3020 కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు కోలగట్ల శ్రావణి, కేదార శెట్టి సీతారామమూర్తి, కడియాల రామకృష్ణ లను  క్లబ్ సభ్యులు ఉచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లబ్ సభ్యులు గా ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు.

నగర అభివృద్ధి తో పాటు క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా తోట పాలెం లో రోటరీ క్లబ్ నిర్మిస్తున్న కైలాస భూమి కి కార్పొరేటర్ కేదార శెట్టి సీతారామమూర్తి లక్ష  విరాళంగా ప్రకటించగా, కార్పొరేటర్ కడియాల రామకృష్ణ 50 వేలు విరాళంగా ప్రకటించారు.

ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు కోలగట్ల శ్రావణి నీ ఉచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ సునీత పూసర్ల, కార్యదర్శి అజయ్ మోహతా తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సారంగపాణి

Satyam NEWS

జాతీయ క్రీడల విజేతలకు ములుగు కలెక్టర్ సత్కారం

Satyam NEWS

యంగ్‌ హీరో నాగశౌర్య, సంతోష్‌ జాగర్లపూడి కాంబినేష‌న్‌లో `ల‌క్ష్య`

Satyam NEWS

Leave a Comment