ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్స్ లో విజేతలను ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేడు సన్మానించారు. 2022-23 సంవత్సరానికి గత ఆగస్టులో నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్స్ లో ములుగు జిల్లా నుంచి ఇద్దరు పాల్గొన్నారు. మంగపేట జెడ్ పి హెచ్ ఎస్ నుంచి శ్రీరాములు, సతీష్ కుమార్, (EE)(TW) సీనియర్ అసిస్టెంట్ కే. లక్ష్మీనారాయణ ఈ క్రీడల్లో పాల్గొన్నారు. శ్రీరాములు, సతీష్ కుమార్, కే. లక్ష్మీనారాయణ కబడ్డీలో నేషనల్ కి ఎంపికయ్యారు. వీరిని జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి DYSO పివిఆర్ చారి, లావణ్య, కోచ్ కుమారస్వామి హాజరైనారు.
previous post