23.7 C
Hyderabad
May 8, 2024 06: 59 AM
Slider ఖమ్మం

22లోగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి

#Collector V.P.j4pg

బూత్ లెవల్ అధికారులతో ఓటర్ జాబితా డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియ 22 జూన్ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, సిడిపిఓ లతో ఎలక్టోరోల్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డోర్ టు డోర్ వెరిఫికేషన్ లో చనిపోయిన వారు ఓటరు జాబితాలో ఉంటే, తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. షిఫ్ట్ అయిన వారు ఉంటే ఫారం 7 సేకరించాలన్నారు.

ఆయా ఇంట్లో వచ్చే అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండువారు, ఇప్పటికే 18 సంవత్సరాలు నిండి, ఓటు హక్కు పొందని వారు ఉంటే ఫారం 6 సేకరించాలన్నారు. మొబైల్ నెంబరు తప్పనిసరిగా సేకరించాలన్నారు. మార్పులకు ఫారం 8 సేకరించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ దిశగా బూత్ లెవల్ అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో వున్న వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉండేదని, ఇప్పుడు దివ్యాoగులు, 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ఇవ్వనున్నారని ఆయన అన్నారు.

ఈ తరహా వారిని గుర్తించి, జాబితాలో మార్క్ చేయాలన్నారు. రోజుకు ఒక బూత్ లెవల్ అధికారి, కనీసం 30 నుండి 40 ఇండ్ల తనిఖీలు చేపడితేనే లక్ష్యం పూర్తవుతుందని, ఈ దిశగా కార్యాచరణ చేపట్టి, పరిశీలన పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు.

Related posts

“చిరునవ్వుతో” ప్రేక్షకహృదయాలు కొల్లగొట్టి 20 ఏళ్లు!!

Sub Editor

టీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ: అసలు కథ ఏమిటి?

Satyam NEWS

ఫిబ్రవరి 17 న విడుదల కానున్న “వినరో భాగ్యము విష్ణుకథ”

Bhavani

Leave a Comment