42.2 C
Hyderabad
May 3, 2024 16: 49 PM
Slider చిత్తూరు

అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ చైర్ పర్సన్ గా డాక్టర్ కృష్ణ ప్రశాంతి

ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా(AP API CHAIR PERSON) చైర్ పర్సన్ గా ప్రముఖ వైద్యురాలు ఫిజీషియన్ కృష్ణ ప్రశాంతి ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయం అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జరిగిన 49వ వార్షిక సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. వారిని అభినందిస్తూ డాక్టర్ కృష్ణ ప్రశాంతి డాక్టర్ హరినాథ్ రెడ్డి దంపతులను గురువారం నవీన్ కుమార్ రెడ్డి కలసి శాలువతో సత్కరించారు.

డాక్టర్ కృష్ణ ప్రశాంతి తిరుపతి నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో అనేక హెల్త్ క్యాంపులు అవగాహన సదస్సులు నిర్వహించి ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక భూమిక పోషించారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రతినిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజా ప్రతినిధులతో జిల్లా అధికార యంత్రాంగంతో చర్చిస్తూ అనేక ప్రాంతాలలో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, టెలి మెడిసిన్ ద్వారా అనేక మంది ప్రజల ప్రాణాలను కాపాడారని ఆయన అన్నారు. తిరుపతి వైద్య కళాశాలలో  విద్యను అభ్యసించి సేవా తత్పరతతో వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న డాక్టర్ కృష్ణ ప్రశాంతి  వైద్య పరంగా మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి

Bhavani

ఇంటింటికీ జాతీయ జెండా కార్య‌క్ర‌మం ప్రారంభం…!

Satyam NEWS

వ్యత్యాసం..

Satyam NEWS

Leave a Comment