బాగ్ అంబర్పేట్ డివిజన్ వైభవ్ నగర్ కాలనీలో డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న డ్రైనేజీ మాన్యువల్ వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. సిమెంట్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. డివిజన్ లోని ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినచో వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిఈఈ దుర్గాప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి జమ్మి చెట్టు బాలరాజ్, అడ్వకేట్ శ్రీహరి, బాలకృష్ణ గౌడ్, హేమంత్, రామ్ రెడ్డి పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట