ఈ నెల 18న ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరయి విజయన్, ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లను ఈ సభకు ఆహ్వానించారు.
కేజ్రీవాల్, భగవంత్మాన్, అఖిలేష్లు అంగీకారం తెలిపారు. అదే సమయంలో 18న ఖమ్మం కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని 100 ఎకరాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలలో కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలున్నాయి. 18న జరిగే సభకు ఖమ్మంతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి జనసమీకరణ జరపనున్నారు.