కరోనా సెకండ్ వేవ్ విజయనగరం పోలీసు శాఖ కూ తీరని లోటును మిగిల్చింది. విజయనగరం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ గా పని చేస్తున్న పాపారావు కరోనా సోకి మృతి చెందారు.రెండు రోజుల క్రితమే కరోనా సోకడంతో వైజాగ్ లో చికిత్స పొందుతున్నారు.
చికిత్స పొందుతూ, మృతి చెందారు. ఈ వార్త పాపారావు కుటుంబానికే కాకుండా పోలీసు శాఖనే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ ఆకస్మిక ఊహించని వార్త..యావత్తు పోలీస్ శాఖ కే పెద్ద లోటు.ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారీ.. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.