ఆటవి రక్షణలో తన విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్ ఓ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మని డిప్యూటీ తహసీల్దార్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హరితోత్సవం సందర్భంగా నియామక పత్రాన్ని హైద్రాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ అందజేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుందని, వారి సతీమణికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని కల్పించడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. వారి కుటుంబం తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు.