29.7 C
Hyderabad
May 3, 2024 05: 53 AM
Slider ఆదిలాబాద్

దుబ్బాక విజయంతో తడాఖా చూపించిన బిజెపి

BJP Nirmal

రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా గెలుపొంది హైదరాబాద్ గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగర ఇస్తామని గోదావరి కృష్ణా జిల్లాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్ నాథ్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దుబ్బాక లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు సంబరాలు అంబరాన్నంటాయి.

దుబ్బాక విజయం రాష్ట్రంలోని బిజెపి నాయకులకు మంచి బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ నరకాసురుడి కి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణకు దీపావళి ముందే వచ్చిందని ఆయన తెలిపారు. రఘునందన్ రావు గెలుపుతో నాలుగు రోజుల ముందే దీపావళి సంబరాలు జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.

 ఎన్నికల ప్రచార సమయంలో దుబ్బాక లో హరీష్ రావు ఒక ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పట్టుకొని ఒరేయ్ అనే అహంకారపూరిత ధోరణితో మాట్లాడటంతో దుబ్బాక ప్రజలు కూడా సరైన గుణపాఠాన్ని నేర్పినట్లు అయిందని అన్నారు.

 ఇప్పుడే ఇప్పటికైనా కెసిఆర్ ఫాం హౌస్ లో పండకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రజలు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల తెలంగాణ కాదని బడుగు బలహీన వర్గాల తెలంగాణ అని ఆయన అన్నారు.

Related posts

రానా విరాట ప‌ర్వం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sub Editor

సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అన్న బిజెపి వాగ్ధానం ఏమైంది?

Satyam NEWS

ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వెంటనే చేపట్టండి

Bhavani

Leave a Comment