31.2 C
Hyderabad
May 2, 2024 23: 37 PM
Slider నిజామాబాద్

క్రైస్తవులకు షబ్బీర్ అలీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

#greetings

క్రైస్తవులకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ శుభకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు. ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం ఉండాలని క్రీస్తు బోధించారని, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని అన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి చర్చికి కేకులు, శీతల పానీయాలు అందజేశారు.

Related posts

పార్టీలకు అతీతంగా ’సర్ధార్‌ సర్వాయిపాపన్న సేన’ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

Satyam NEWS

ఇదీ మన సంస్కారానికి నిదర్శనం

Satyam NEWS

ఈతకు వెళ్లి నలుగురు యువకుల మృతి….

Satyam NEWS

Leave a Comment