రాష్ట్ర విద్య శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ… తన స్వంత జిల్లా అయిన విజయనగరం కు రానున్నారు.ఈ మేరకు.. ప్రచార ,సమాచార సంబంధాల శాఖ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు.
ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని తన నివాసానికి చేరుకొని 9.30 గంటలకు చీపురుపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాలను ప్రారంభిస్తారు. 10 గంటలకు లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
10.30 గంటలకు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొంటారు.
16న ఉదయం 9.30 గంటలకు చీపురుపల్లి చేరుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన పనులను పరిశీలిస్తారు.
17న జిల్లా కేంద్రంలోని కస్పా మునిసిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొంటారు.