31.7 C
Hyderabad
May 2, 2024 09: 57 AM
Slider రంగారెడ్డి

రిక్వెస్ట్: టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

danam nagender

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పోచారం మున్సిపాలిటీలోని నారపల్లి లో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ యం.యల్.ఏ దానం నాగేందర్ పాల్గొనడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం లో లేడని, ప్రజల గుండెల్లో నుండి పుట్టిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

మంచి పరిపాలన అందిస్తున్న తెరాస పార్టీ కి ఓటు వేయాలని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ కు చేయూతనిచ్చేందుకు మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్నారు. నేడు జరిగిన ప్రచార సభలో ఇంచార్జ్ పుట్టం పురుషోత్తం, సురేందర్ రెడ్డి, వి.జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంతోష్ గుప్తా, టి.ఆర్.ఎస్ అభ్యర్థులు, నాయకులు జయరాజ్ యాదవ్, గణేష్ యాదవ్, బొట్టు వెంకట్, పద్మ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి గోదా కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

తిరుపతి టాక్సీ డ్రైవర్ల కడుపు కొట్టే ఆలోచనను ఉపసంహరించుకోవాలి

Bhavani

SBI ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam NEWS

Leave a Comment