బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ జంగం శివానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెవెన్యూ అధికారి పండరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లికార్జున్, ఉపాధి హామీ టెక్నికల్ స్టెంట్ చంద్రయ్య గ్రామ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.