కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో 20మంది కుటుంబాలకు సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి నిత్యావసరాల సరుకులను పంపిణీ చేశారు. గురువారం పట్టణ కేంద్రం వరిదేలా కాలనిలో దర్జే సత్యనారాయణ నీరు పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా సిఐ వెంకట్ హాజరయ్యారు. మొత్తం 20మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనుషులు సేవ భావం కలిగి ఉండాలన్నారు. కష్టకాలంలో మనుషులకు మనుషులే తోడు కావలన్నారు. అనంతరం సిఐ బి.వెంకట్ రెడ్డి సత్యనారాయణను అభినందించారు