మాజీ ఎస్ఈసీ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్, మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. కౌంటర్ దాఖలు చేసేందుకు శనివారం వరకు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. రిజిస్ట్రార్ జ్యుడీషియరికి మెయిల్ ద్వారా అడ్వొకేట్ జనరల్ ఈ విషయం తెలిపారు. తమ ముందు ఉన్న అవకాశాల ద్వారా కోర్టులో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం గడువు కోరినట్లు సమాచారం.