ఉప్పల్ నియోజకవర్గం ప్రాంతంలోని ఈశ్వరిపురి కాలని సంక్షేమ సంఘం అధ్యక్షులుగా డి.వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా నరేందర్ బాబు, కార్యదర్శిగా పి.అనిత, సంయుక్త కార్యదర్శిగా యం. పాండు, కోణధికారిగా సి.శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా కామేశ్వర్ రావు, రాఘవేంద్ర చౌదరి, వి.వి.యస్.సత్యనారాయణ, కే.వెంకటేశ్వర్ రావు, ఎం.వి.యస్.మూర్తి, పాపిరెడ్డి, మధుసూధన్ రెడ్డి, కె.శ్రీకర్ లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను కాలని పూర్వ అధ్యక్షులు ఆర్.వి.క్రిష్ణారెడ్డి, ఉన్నిక్రిష్ణన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం కాప్రా డివిజన్ వెంకటేశ్వర దేవాలయ కళ్యాణ మండపంలో జరిగినది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
previous post
next post