33.2 C
Hyderabad
May 4, 2024 01: 32 AM
Slider ఆధ్యాత్మికం

సూర్య భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఉత్తర భారతీయులు

#bandari

కార్తీక మాసంలో ఉత్తర భారతీయులు సూర్యభవాన్ డికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

చర్లపల్లి చెరువు దగ్గర ఆదివారం ఉత్తర భారతీయులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్న ఛఠ్ పూజ కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్, ఒడిస్సా, ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, నేపాల్ లకు చెందిన ప్రజలు కుటుంబ సమేతంగా కొలనులోకి దిగి సూర్యుడిని కొలవడం జరుగుతుందన్నారు.
ఉపవాస దీక్షలతో సూర్య భగవాన్ ను పూజించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో చట్ పూజ ఉత్సవ కమిటీ సభ్యులు అజయ్ కుమార్, రాంజీ యాదవ్, అనూప్ సింగ్, అజయ్ కుమార్, నాయకులు నేమూరి మహేష్ గౌడ్, వెంకిర్యాల నరసింహ, గుమ్మడి జంపాలరెడ్డి, రంజిత్ రెడ్డి, పాండు, లోకనాథ్, సాయికిరణ్, బాబు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పోటీ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

Satyam NEWS

మునిసిపల్ కార్మికులకు గంగమ్మ జాతర బహుమానం ఇవ్వాలి

Bhavani

మానవాళి మనుగడకు మాస్కు రక్ష :నల్లగొండ సిఐ చంద్రశేఖర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment