34.7 C
Hyderabad
May 5, 2024 00: 52 AM
Slider నల్గొండ

ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్ టీకా తీసుకోవాలి

#vaccine

కరోనా 3వ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా పట్టణం లోని టౌన్ హాల్ నందు వైద్య సిబ్బందిని వాక్సిన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం, శానిటైజర్, సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను నాగేశ్వరరావు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమర్నాధ్ రెడ్డి,కౌన్సిలర్ కె.ఎల్.ఎన్.రావు, గంగరాజు,లింగయ్య, వీరారెడ్డి వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ,సిహచ్.స్వాతి,ఆశ కార్యకర్త హేమలత,సంధ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఐదుగురు మహిళల ప్రాణాలు కాపాడిన పోరుమామిళ్ల పోలీసులు

Satyam NEWS

రైతులను బ్యాంకర్లు ఆదుకోవాలి

Satyam NEWS

నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు బెదిరింపులు

Satyam NEWS

Leave a Comment