కరోనా 3వ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా పట్టణం లోని టౌన్ హాల్ నందు వైద్య సిబ్బందిని వాక్సిన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం, శానిటైజర్, సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను నాగేశ్వరరావు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమర్నాధ్ రెడ్డి,కౌన్సిలర్ కె.ఎల్.ఎన్.రావు, గంగరాజు,లింగయ్య, వీరారెడ్డి వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ,సిహచ్.స్వాతి,ఆశ కార్యకర్త హేమలత,సంధ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్