నిజాలను నిర్భయంగా రాస్తున్న అంబర్ పేట నియోజక వర్గానికి చెందిన కొంతమంది రిపోర్టర్ల పై స్థానిక బిజెపి నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. టిఆర్ఎస్ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ ను కవర్ చేసిన ప్రజా తెలంగాణ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సద్దాం కు ఆదివారం రాత్రి బాగ్ అంబర్ పేట్ డివిజన్ కు చెందిన ఓ బిజెపి నేత ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
మా పార్టీ గురించి మంచి వార్తలు రాయి లేకపోతే.. నీ పని చూస్తామంటూ ఆ నేత బెదిరింపులకు దిగాడు. తాజాగా సోమవారం అంబర్ పేటలో బిజెపి కు ఎదురుగాలి అంటూ వార్త రాసిన దిశా రిపోర్టర్ కు బిజెపి నేతల నుండి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. అయితే తోటి విలేకరి ఒకరు కూడా ఆయనకు ఫోన్ చేసి అలాంటి వార్త రాస్తే నీ ఉద్యోగం పోతుంది అంటూ హెచ్చరించినట్లు తెలిసింది.
సత్యం న్యూస్, అంబర్పేట్